- Advertisement -
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాసేపట్లో గ్రేటర్ తొలి రౌండ్ ఫలితాలు వెల్లడికానున్నాయి. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. మొత్తం 150 డివిజన్లలో 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తక్కువ పోలింగ్ జరిగిన డివిజన్ల నుంచి ఫలితాలు త్వరగా రానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బిజెపి అధిక్యంలో ఉంది. పోస్టల్ ఓట్లలో టిఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. మొత్తం 1,926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. అందులో దాదాపు 40శాతం చెల్లని ఓట్లు ఉన్నాయి. కొన్ని డివిజన్లలో పార్టీలకు సరిసమాన ఓట్లు వచ్చాయి. 14 డివిజన్లలో ఫలితాలు బాగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 136 డివిజన్లలో మరో 3-4గంటల్లో ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- Advertisement -