Saturday, April 27, 2024

టీమిండియా గెలిస్తే వైజాగ్ బీచ్ లో బట్టలిప్పి పరుగెడతా: టాలీవుడ్ నటి

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన స్ట్రీకింగ్ ఇప్పుడు ఇండియాలోకీ వచ్చేసింది. మాట్లాడితే చాలు… స్ట్రీకింగ్ చేస్తానంటూ ముందుకొస్తున్నారు అమ్మాయిలు. పబ్లిసిటీ కోసం స్ట్రీకింగ్ చేస్తున్నవాళ్లూ ఎక్కువైపోయారు. తాజాగా రేఖా బోజ్ అనే ఓ తెలుగు నటి బోల్డ్ ఆఫర్ తో ముందుకొచ్చింది. పైనల్లో టీమిండియా గెలిస్తే, వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానని ప్రకటించింది. దీనిపై నెటిజన్లు ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు.

ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొందరంటే, ఇలా చేయడం సిగ్గు చేటని మరికొందరు మండిపడుతున్నారు. గతంలో సినీ నటి పూనమ్ పాండె కూడా ఇలాగే స్ట్రీకింగ్ చేస్తానంటూ 2011 ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో ప్రకటించి సంచలనం సృష్టించింది. అప్పట్లో టీమిండియా కప్పును గెలుచుకున్నా, పాండే మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు.

అయితే తాను పబ్లిసిటీ కోసం స్ట్రీకింగ్ చేస్తానని అనడం లేదనీ, క్రికెట్ మీద అభిమానంతోనే అంటున్నాననీ రేఖ తెలిపింది. వైజాగ్ కు చెందిన ఈ నటీమణి గతంలో దామినీ విల్లా, కాత్యాయనీ వంటి చిన్నా చితకా సినిమాల్లో నటించింది. బ్రేక్ రాకపోవడంతో వైజాగ్ లోనే ఉంటూ ఓ స్టూడియో నడుపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News