Sunday, May 5, 2024

రెండో ఇన్నింగ్స్: ఆట ముగిసే సమయానికి భారత్ 54/1

- Advertisement -
- Advertisement -

చెన్నై: చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ జట్టును తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులకే ఆలౌట్ చేసి, 195 పరుగుల ఆధిక్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ శుభమన్ గిల్(14)ను జాక్ లీచ్ పెవిలియన్ కు పంపాడు. దీంతో భారత్ 42 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన చటేశ్వర పుజారా(7)తో కలిసి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(24) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం భారత్ కు 249 పరుగుల ఆధిక్యం లభించింది.

India 54/1 at Stumps on Day 2 in Second Test 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News