- Advertisement -
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. బుదవారం రాత్రి పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత జవాన్ అమరుడయ్యాడు. గత రాత్రి 10 గంటల ప్రాంతంలో పూంచ్ జిల్లాలోని కృష్ణఘటి సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి చిన్న ఆయుధాలు, మోర్టార్లతో పాకిస్తాన్ సైన్యం కాల్పులతో కవ్వింపులకు దిగింది. ఇందులో ఇండియన్ ఆర్మీకి చెందిన లాన్స్ నాయక్ కర్నైల్ సింగ్ చనిపోయాడని ఆర్మీ పిఆర్ఒ వెల్లడించాడు.
- Advertisement -