- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు 63 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 86,821 కొత్త కోవిడ్-19 కేసులు, 1,181 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,12,585కి చేరింది. దేశంలో 9,40,705 యాక్టివ్ కేసులుండగా.. 52,73,202 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 98,678 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో సెప్టెంబర్ 30 వరకు మొత్తం 7,56,19,781 నమూనాలను పరీక్షించారు. వీటిలో బుధవారం 14,23,052 మంది బాధితులకు పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.
India COVID 19 tally crosses 63 lakh mark
- Advertisement -