- Advertisement -
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అటవీశాఖాధికారి వి.బి భాస్కర్ రమణమూర్తి హైదరాబాద్లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ గృహకల్ప భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 1987 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) బ్యాచ్ కి చెందిన రమణ మూర్తి ప్రస్తుతం ఎపి అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అసలు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
IFS officer committed suicide in Hyderabad
- Advertisement -