Sunday, May 12, 2024

గవర్నర్‌ను కలిసిన ‘ఇండియా’ నేతలు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : కల్లోలిత మణిపూర్‌లో ‘ఇండియా’ కూటమి నేతలు ఆదివారం పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. దేశం లోని అన్ని పార్టీలు కలిసి మణిపూర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు. మణిపూర్‌లో పర్యటిస్తున్న ఇండియా కూటమి నేతలు ఆదివారం ఉదయం గవర్నర్ అనుసూయ ఉకేను కలిశారు. ఇంఫాల్ లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయిన 21 మంది ఎంపీలు మెమోరాండం సమర్పించారు. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News