- Advertisement -
న్యూఢిల్లీ : టీకా పాస్పోర్టులకు వ్యతిరేకంగా భారత్ జి 7 దేశాల ఆరోగ్య మంత్రుల సదస్సులో గళమెత్తింది. భారత్ తరఫున పాల్గొన్న కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఈ ఆలోచన విషపూరితమని, అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు దీనివల్ల నష్ట పోతారని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టీకాలు పొందిన వారి శాతం చాలా తక్కువైనందున టీకా పాస్పోర్టులు తెస్తే ఆ దేశాలపై తీవ్రమైన వివక్ష చూపినట్టవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. టీకా లభ్యత విషయంలో అన్ని దేశాలకు సమన్యాయం జరిగేలా ఉత్పత్తి పెంచాలని సూచించారు.
- Advertisement -