Monday, April 29, 2024

పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ధర్నా (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

Youth Congress workers hold protest against fuel price hike

ముంబై: దేశంలో చమురు ధరలు పెంపును నిరసిస్తూ యువజన కాంగ్రెస్ నేతలు శనివారం ధర్నాకు దిగారు. ముంబైలోని బిజెపి కార్యాలయం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీతో సహా 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అటు దేశంలో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. తెలంగాణలోని కొన్ని జిల్లాలోనూ పెట్రో ధరలు వంద దాటాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో లాక్ డౌన్ వేళ చమురు సంస్థలు ధరలు పెంచడంతో ప్రజలు తామేలా బ్రతకాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News