Friday, April 26, 2024

వారిద్దరి మధ్య ఎలాంటి పోటీ ఉండదు

- Advertisement -
- Advertisement -

VVS Laxman said that Kohli and Williamson are best Cricketers

 

స్కోర్ : విరాట్ కోహ్లీ, విలియమ్సన్ ఉత్తమ క్రికెటర్లని వివిఎస్ లక్ష్మణ్ తెలిపారు. వీరి మధ్య ఎలాంటి పోటీ ఉండదని, వారిరువురు పరస్పరం గౌరవించుకుంటారని, జట్ల కోసమే కష్టపడతారని వెల్లడించారు. వారిద్దరు ప్రపంచ వ్యాప్తంగా యువతకు ఆదర్శప్రాయులు. వారు జట్లను నడిపిస్తున్న తీరు అమోఘం. సొంత ప్రతిభ, సామార్థ్యంపై ఆశావహ ధృక్పథంతో ఉంటారు. సీనియర్లు వీడ్కోలు పలికాక జట్లను సమర్థవంతంగా నడిపిస్తున్నారని లక్షణ్ చెప్పారు. టెస్టు ఫైనల్ పరిస్థితులు కివీస్ కే అనుకూలం అని తెలిపారు. విదేశాల్లో ఎప్పుడు టెస్టు సిరీసులు ఆడాలన్నా ముందుగానే ఒకటో, రెండో సన్నాహక మ్యాచులు ఆడటం ఆనవాయితీ. అప్పుడు పరిస్థితులకు అలవాటు పడతారు. అందుకే కొన్నేళ్లుగా జట్లన్నీ ఇలాగే చేస్తున్నాయి. పరిస్థితులకు బ్యాట్స్ మెన్ అలవాటు పడటం అవసరం. న్యూజిలాండ్ ముందుగానే ఇంగ్లాండ్ వెల్లింది. కాబట్టి ఆ జట్టుకు ప్రయోజనం ఉంటుంది. టీమ్ ఇండియా వెనుకంజలో ఉందనుకోవద్దు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో వారికి తెలుసు. ఆస్ట్రేలియాలో ఆ జట్టు పోరాటం, సానుకూల ధృక్పథాన్ని మనం చూశాం. ఫైనల్ కు ముందు కోహ్లీసేన కఠోరంగా సాధన చేస్తుందని లక్ష్మణ్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News