Saturday, May 18, 2024

దేశంలో కరోనా తగ్గుముఖం

- Advertisement -
- Advertisement -

India Report 13405 New Corona Cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,405 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 235మంది మరణించారు. దీంతో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 4,28,51,929కి చేరింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 5,12,344మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా మహమ్మారి నుంచి 34,226 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,21,58,510 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,81,075 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రోజువారీ కరోనా రేటు 1.24శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 175.83 కోట్ల మందికి కోవిడ్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.

India Report 13405 New Corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News