Saturday, May 4, 2024

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. 562మంది మృతి

- Advertisement -
- Advertisement -

India report 42625 new Covid cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,625 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కారోనాతో మరో 562మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,17,69,132కు చేరింది. గత 24 గంటల్లో 26,668 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 3,09,33,022మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనాతో మొత్తం 4,25,757మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,10,353 కొవిడ్ యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.37శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

India report 42625 new Covid cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News