Friday, May 3, 2024

దేశంలో కొత్తగా మరో 11వేల కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 11466 New Corona Cases in 24 hours

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా రోజువారి కేసులు 12వేలకు పడిపోయాయి. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడగా, క్రియాశీల రేటు క్రమంగా తగ్గుతోంది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. గత 24 గంటల్లో 11,466మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని పేర్కొంది. కరోనాతో మరో 460మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.43కోట్లు దాటింది. ఇప్పటివరకు 4,61,849 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,39,683 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కేరళలో నిన్న ఒక్కరోజే 6,409 కరోనా కేసులు, 47 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 109 కోట్లకు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

India Reports 11466 New Corona Cases in 24 hours

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News