- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 12,194 కొత్త కోవిడ్-19 కేసులు, 92 మరణాలు సంభవించాయి. తాజాగా మరో 11,106 కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,04,940 చేరింది. ఇండియాలో ఇప్పటివరకు 1,06,11,731 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 1,55,642 మంది బాధితులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్ లో 1,37,567 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా 82,63,858 మందికి టీకాలు ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఇండియాలో నిన్నటి వరకు మొత్తం 20,62,30,512 కోవిడ్-19 పరీక్షలు చేసినట్టు ఐసిఎంఆర్ తెలిపింది. అందులో శనివారం 6,97,114 మంది బాధితుల శాంపిళ్లను పరీక్షించినట్లు ప్రకటించింది.
India reports 12194 new Covid-19 cases
- Advertisement -