Wednesday, May 8, 2024

దేశంలో 2వేల దిగువకు పడిపోయిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India reports 1761 new Covid-19 cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు రెండు వేల దిగువకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1761 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 127మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4.30కోట్లుకు చెరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 3196 మంది కోలుకోగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 4.24కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, కరోనాతో దేశంలో మొత్తం 5,16,479మంది బాధితులు మరణించారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 26,240 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో రోజువారి పాజిటీవిటి రేటు 0.41 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 181 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

India reports 1761 new Covid-19 cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News