Tuesday, May 21, 2024

దేశంలో కొత్తగా 7145 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 7145 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 7145 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 289మంది బాధితులు మృతిచెందారని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,33,194కు చేరుకుంది. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,77,158 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 8706 మంది బాధితులు కోలుకోగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,41,71,471 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 84,565 కరోనా యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 136.66కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

India Reports 7145 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News