Monday, May 6, 2024

హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా భారత్ గుర్తిస్తుందని ఆశాభావం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గాజా ప్రజలకు భారత దేశం మానవతాసాయం పంపడం మంచిదే అని ఇజ్రాయెల్ రాయబారి నావోర్ గిలాన్ ఒక ప్రత్యేక ఇంటర్వూలో అభిప్రాయం వెలిబుచ్చారు. హమాస్‌కు సంబంధించిన తగినంత సమాచారాన్ని ఇజ్రాయెల్ భారత్‌కు అందిస్తోందని, దీంతో హమాస్ ఉగ్రవాద సంస్థగా దాదాపు 40 దేశాలు గుర్తించినట్టు భారత్ కూడా గుర్తిస్తుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుత సంక్షోభం ఒక్కటే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంత దృఢంగా ఉన్నాయో నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. కేరళ లో పాలస్తీనా మద్దతు ర్యాలీలో హమాస్ నాయకుడు ఖలీద్ మషాల్ వర్చువల్‌గా పాల్గొనడంపై ప్రస్తావన తీసుకురాగా హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా భారత్ వల్లనే అలాంటి చర్యలను నివారించవచ్చని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News