Saturday, May 4, 2024

మహమ్మారిసహా సంక్షోభాలను దీటుగా ఎదుర్కొన్నాం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

India strong despite pandemic disasters:Modi

న్యూఢిల్లీ: గతేడాది కరోనా మహమ్మారితోపాటు సరిహద్దులో ఉద్రిక్తతలు, తుపాన్లు, భూకంపాలులాంటి వాటిని ఎదుర్కోవడంలో భారత్ తన సత్తా చాటిందని ప్రధాని మోడీ అన్నారు. భారత్‌ను శక్తివంతమైన దేశంగా ప్రపంచం గుర్తించిందని ఆయన అన్నారు. మంగళవారం బిజెపి పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని ప్రసంగించారని కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌మేఘ్‌వాల్ తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, ఎస్.జైశంకర్ కూడా ప్రసంగించారు. పలు దేశాలకు సత్వరమే వ్యాక్సిన్లను సరఫరా చేయడం ద్వారా భారత్ తన దౌత్యనీతిని ప్రదర్శించిందని, దాంతో దేశ ప్రతిష్ఠ పెరిగిందని విదేశాంగశాఖమంత్రి జైశంకర్ అన్నారు. పార్లమెంట్‌కు రెగ్యులర్‌గా హాజరు కావాలని ఈ సందర్భంగా ప్రధాని తన పార్టీ ఎంపీలకు సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News