Tuesday, May 21, 2024

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ చెంగప్ప..

- Advertisement -
- Advertisement -

India Today Editor Raj Chengappa plant saplings

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్, డైరెక్టర్ రాజ్ చెంగప్ప జామ మొక్కను నాటారు. శనివారం ఎంపి సంతోష్, రాజ్ చెంగప్పను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంపై ఎంపీ సంతోష్, చెంగప్పకు వివరించారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చెట్ల పెంపకంపై నిర్వహిస్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై చెంగప్ప హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇండియా గేట్ సమీపంలోని పండార పార్కులో జామ మొక్కను నాటి తన వంతుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతగానో దోహద పడుతుందని, ఇలాంటి కార్యక్రమాలో స్వచ్ఛందంగా అందరూ పాల్గొనాలని రాజ్ చెంగప్ప అభిప్రాయబడ్డారు. భారతదేశం అంతటా రాబోయే రోజుల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు పెంపకం చేపట్టేందుకు తనవంతుగా కృషి చేస్తానని ఎంపి సంతోష్ అన్నారు.

India Today Editor Raj Chengappa plant saplings

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News