Monday, May 6, 2024

తొలి వన్డేలో టీమిండియా ఓటమి..

- Advertisement -
- Advertisement -

లఖ్‌నవూః ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా అటల్ బిహారి వాజ్‌పేయీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 177 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్(50), హర్మన్‌ప్రీత్ కౌర్(40)లు మాత్రమే రాణించారు. మిగతా వారంతా ఘోరంగా విఫలమవ్వడంతో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం 178 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. ఓపెనర్లు లిజెల్లీ(83 నాటౌట్), లారా వాల్వా(80)లు రాణించడంతో దక్షిణాఫ్రికా సునాయస విజయం సాధించింది.

India women’s Team defeat by South Africa in 1st ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News