Saturday, April 27, 2024

అమెరికాలో ప్రవాస భారతీయుని హత్య

- Advertisement -
- Advertisement -
Indian-origin gas station owner shot dead in US
కూతురి పుట్టిన రోజునే దారుణం

న్యూయార్క్ : జార్జియా రాష్ట్రం లోని ఈస్ట్ కొలంబస్ ప్రాంతంలో ప్రవాస భారతీయుడు అమిత్‌కుమార్ పటేల్ (45) సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈస్ట్ కొలంబస్ లోని బునా విస్టా రోడ్డులో సినోవస్ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్లగా గుర్తు తెలియని దుండగుడు ఆయనపై కాల్పులు జరిపి ఆయన వద్దనున్న డబ్బు దోచుకుని పారిపోయాడు. ఆయన బ్యాంకులో అడుగుపెడుతుండగానే ఈ హత్య జరిగింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

అమిత్ కుమార్తె పుట్టిన రోజునే ఈ దారుణం జరగడంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. స్టీమ్ మిల్ రోడ్డులో చెవ్రాన్ గ్యాస్ కంపెనీకి ఆయన యజమాని. ఆయన వ్యాపార భాగస్వామి విన్నీ పటేల్ ఈ దారుణాన్ని వివరిస్తూ అమిత్ బ్యాంకులో అడుగుపెడుతుండగా కాల్పులు జరిగాయని చెప్పారు. వీరిద్దరూ గత ఆరేళ్లుగా కలసి వ్యాపారం చేస్తున్నారు. మృతుడు అమిత్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. ఇదే విధంగా టెక్సాస్‌లో నవంబర్ 17 న సజన్ మేథ్యూ (55) అనే డాలర్ స్టోర్ యజమాని దోపిడీ దొంగ చేతిలో హత్యకు గురయ్యాడు. మేథ్యూ హంతకుడు 15 ఏళ్ల బాలుడు అరెస్టయ్యాడు. హతుడు మేథ్యూకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News