Wednesday, May 1, 2024

అట్లాంటాలో పివి విగ్రహ ప్రతిష్టాపన

- Advertisement -
- Advertisement -

Installation of a PV statue in Atlanta

రాజ్యసభ సభ్యుడు కేశవరావు, పివి కమిటీ సభ్యులతో భేటీ అయిన
అమెరికన్ ఇండియన్ అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ పాడి శర్మ

మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మంగళవారం పివి శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పివి కమిటీ సభ్యులు పివి ప్రభాకర్, మహేష్ బిగాల, చంద్ర శేఖర్, అమెరికా ప్రతినిధులు డాక్టర్ పాడి శర్మలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో విగ్రహాన్ని ఇండియా నుంచి తరలించడం, తేదీ వివరాలు, కార్యక్రమ నిర్వహణ గురించి చర్చించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి అట్లాంటాలో మార్టిన్ లూథర్ కింగ్ (MLK) కుటుంబ సభ్యులు, గాంధీ స్టాట్యూ ఫౌండేషన్ ప్రతినిధులు, లోకల్ సెనేటర్స్‌ని, అమెరికా వ్యాప్తంగా ఉన్న పివి అభిమానులతో పాటు రాష్ట్రం నుంచి ప్రముఖులను, పివి కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నట్టు కేశవరావు తెలిపారు. మిగతా దేశాల్లో విగ్రహ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News