Tuesday, May 14, 2024

సన్‌రైజర్స్‌ టార్గెట్ 160

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌ 2021లో భాగంగా జరుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీ షా(53: 39 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌) అర్ధశతకంతో రాణించాడు. కెప్టెన్ రిషబ్‌ పంత్‌(37: 27 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌), స్టీవ్‌ స్మిత్‌(34 నాటౌట్‌: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌), శిఖర్‌ ధావన్‌(28)లు పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సిద్ధార్థ్‌ కౌల్‌ రెండు వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

IPL 2021: DC set target 160 runs against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News