Tuesday, May 7, 2024

ఆరేసిన ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

IPL 2021: Delhi solid win over Punjab Kings

రాణించిన ధావన్, పృథ్వీషా
పంజాబ్‌పై క్యాపిటల్స్ గెలుపు

అహ్మదాబాద్ : ఐపిఎల్ సీజన్14లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో విజయం అందుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ వహించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ 58 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, 8 బౌండరీలతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచి పోయాడు. మిగిలిన వారిలో మలాన్ (26) మాత్రమే కాస్త రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో రబడా మూడు వికెట్లు పడగొట్టాడు.

శుభారంభం..

తర్వత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీషాలు అండగా నిలిచారు. ఇద్దరు పంజాబ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. పృథ్వీషా ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేసిన పృథ్వీ 22 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో 3 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ రెండు సిక్సర్లు, మరో ఆరు ఫోర్లతో 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. హెట్‌మెయిర్ 4 బంతుల్లోనే 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువడంతో ఢిల్లీ మరో 14 బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News