Tuesday, May 14, 2024

మూడు వికెట్లు కోల్పోయిన ముంబై.. చిత్తక్కొడుతున్న పొలార్డ్

- Advertisement -
- Advertisement -

IPL 2021: Polard hits 50 runs in 17 balls against CSK

ఢిల్లీ: ఐపిఎల్ 2021లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(38), క్వింటన్‌ డికాక్‌(35)లు తొలి వికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌(3) నిరాశపర్చాడు. ఆ వెంటనే డికాక్ కూడు పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై 77 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తడిలో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్, చెన్నై బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. భారీ సిక్సులతో చెలరేగిన పొలార్డ్ కేవలం 17 బంతుల్లో అర్థశతకం బాదాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ముంబై 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. క్రీజులో పొలార్డ్(54), కృనాల్ పాండ్యా(17)లు ఉన్నారు.

IPL 2021: Polard hits 50 runs in 17 balls against CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News