Monday, April 29, 2024

కోల్‌కతాకు ఊరట.. రాజస్థాన్‌పై విజయం

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో విజయం అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (25), కెప్టెన్ సంజూ శాంసన్(54), రియాన్ పరాగ్(19), హెట్‌మెయిర్ 27 (నాటౌట్) రాణించారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో నరైన్, ఉమేష్, అన్కుల్ రాయ్ మెరుగైన బౌలింగ్‌ను కనబరిచారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34) పరుగులు చేశాడు. ఇక నితీష్ రాణా 48 (నాటౌట్), రింకు సింగ్ 42 (నాటౌట్) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించారు.

IPL 2022: KKR win by 7 wickets against RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News