Friday, April 26, 2024

IPL: చెలరేగిన తిలక్.. ముంబై 171/7

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్ 2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబయికి ఆదిలోనే షాక్ తగిలింది.ఓపెనర్లు రోహిత్ శర్మ(1), ఈషాన్ కిషన్(10)లతో పాటు కెమెరూన్ గ్రీన్(5)లు వరుసగా పెవిలియన్ కు చేరడంతో 20 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో పడింది.

స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్(15) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ క్రమంలో చెలరేగిపోయిన తిలక్ వర్మ(84 నాటౌట్) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఓ వైపు వరుసగా వికెట్లు కోల్పోతున్న తిలక్ మాత్రం ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో భారీ స్కోరు సాధించిన ముంబై, బెంగళూరుకు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News