Sunday, May 5, 2024

IPL 2023: పంజాబ్ పై బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

- Advertisement -
- Advertisement -

గౌహతి: ఐపిఎల్‌ 2023లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకుని, పంజాబ్ జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించి జోష్ మీదున్న రాజస్థాన్, ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు కోల్‌కతాతో జరిగిన పోరులో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో బోణి కొట్టిన పంజాబ్, రాజస్థాన్ జట్టును ఓడించి తమ జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News