Monday, April 29, 2024

పాక్‌లో జైషే చీఫ్ మసూద్ అజార్ అనుచరుడి హతం

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ సన్నిహిత అనుచరుడు రహీమ్ ఉల్లా తారిఖ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీలో మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా, తారిఖ్‌ను ఆగంతకులు మట్టుబెట్టారు. కరాచీలో అతిపెద్ద మురికి వాడగా పేరున్న ఓరంగి టౌన్‌లో ఈ సంఘటన జరిగింది. దుండగులు అతి సమీపం నుంచి తారిఖ్‌పై పలుమార్లు కాల్పులు జరిపారని, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి.

భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు తారిఖ్ అత్యంత సన్నిహితుడు. జైషే ముఠా సభ్యుల మధ్య అంతర్గత పోరు కారణంగానే తారిఖ్ హత్య జరిగినట్టు తెలుస్తోంది. స్థానిక ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్‌లో టాప్ ఉగ్రవాది హతమవడం ఈ నెలలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం.

గతవారం మరోఉగ్రసంస్థ లష్కరే తోయిబా కమాండర్ అక్రమ్ ఘాజీని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అంతకు ముందు ఈ నెల ఆరంభంలో లష్కరేకు చెందిన మరో ఉగ్రవాది ఖ్వాజా షాహిద్ నియంత్రణ రేఖ సమీపం లోని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో హతమయ్యాడు. తాజాగా తారిఖ్ హత్య చోటు చేసుకోవడంతో పాక్ మరోసారి ఉలిక్కిపడింది. ఈ ఘటనను పాక్ పోలీస్‌లు ఖండించారు. ఇది లక్షిత హత్య అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News