- Advertisement -
రాంచీ: ఝార్ఖండ్ లో ద్విచక్రవాహనదారులకు ఊరట లభించింది. లీటర్ పెట్రోల్ పై రూ.25 తగ్గిస్తున్నట్టు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. తగ్గించిన ధరలు జనవరి 26 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కొంతకాలంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో మధ్యతరగతి, సామాన్యులపై భారం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. అయితే బైకులు, స్కూటర్లకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందన్నారు. దీంతో వాహనాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -