Monday, April 29, 2024

ఎపిలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -

10 New Omicron Cases in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ను ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. ఎపిలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16కి చేరింది. ఒకేరోజు పది కేసులు రావడంతో ఎపి సర్కార్ అలర్ట్ అయింది. తూ.గో జిల్లాలో 3, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2 ఒమిక్రాన్ కేసులు, గుంటూరు, చిత్తూరు, ప.గో జిల్లాల్లో ఒక్కో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. కువైట్,నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News