- Advertisement -
ముంబయి: ప్రముఖ సాహితీవేత్త, జర్నలిస్ట్ అనిల్ ధార్కర్(74) మృతి చెందారు. అనారోగ్యంతో ముంబయిలోని ఓ హాస్పిటల్లో చేరిన ధార్కర్కు గురువారం బైపాస్ సర్జరీ జరిగింది. శుక్రవారం ఆయన మృతి చెందినట్టు సన్నిహితులు తెలిపారు. ప్రతిఏటా నవంబర్లో జరిగే ముంబయి అంతర్జాతీయ సాహిత్య ఉత్సవాలకు ధార్కర్ వ్యవస్థాపక డైరెక్టర్. ఏడాది పొడవునా ముంబయిలో నిర్వహించే లిటరేచర్ లైవ్ కార్యక్రమానికి కూడా ధార్కర్ వ్యవస్థాపక డైరెక్టర్. ధార్కర్ గతంలో పలు వైవిధ్య అంశాలతో కూడిన పత్రికలను నిర్వహించారు. డెబోనాయిర్ మంత్లీ, మిడ్ డే అండ్ సండే(సాయంకాల పత్రిక), ది ఇండెపెండెంట్లాంటి పత్రికలకు ధార్కర్ ఎడిటర్గా పని చేశారు.
- Advertisement -