Sunday, April 28, 2024

ప్రమాదంపై కమల్‌హాసన్‌ తీవ్రదిగ్భ్రాంతి.. మృతులకు రూ.కోటి చొప్పున పరిహారం

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: ఇండియన్ 2 సినిమా సెట్ లో నిన్న రాత్రి జరిగిన భారీ ప్రమాదంపై హీరో కమల్‌హాసన్‌ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరుగడం దురదృష్టకరమని, ప్రమాదంలో ముగ్గురు స్నేహితులను కోల్పోయామని.. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం అందజేస్తానని కమల్‌హాసన్‌ తెలిపారు. బుధవారం రాత్రి చెన్నై శివారులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్ లో ఓ భారీ క్రేన్ తెగి పడిపోవడంతో ఘటనాస్థలంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిలో డైరెక్టర్‌ శంకర్‌ అసిస్టెంట్‌ మధు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కృష్ణ, సహాయకుడు చందర్‌ ఉన్నారు. ఈ ఘటనలో డైరెక్టర్ శంకర్ కు కూడా గాయాలు అయినట్లు తెలిసింది.. కానీ, ఆయన గురించి ఎలాంటి సమాచారాన్ని చిత్రయూనిట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. గాయపడిన మరో 10 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Kamal Haasan to donate Rs.1 cr each family of deceased

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News