Sunday, April 28, 2024

రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్ణాటక మంత్రి బోసురాజు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కర్ణాటక మంత్రి బోసు రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన మంత్రి బోసురాజు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం వారిద్దరూ పలు అంశాలపై చర్చించారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బోసురాజు మాన్వి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది. క్షత్రియ (రాజులు) కులానికి చెందిన బోసు రాజు సిద్దరామయ్య కేబినేట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News