- Advertisement -
హైదరాబాద్: సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కమిషనర్లుగా నమస్తే తెలంగాణ మాజీ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి, టి న్యూస్ మాజీ సిఇఒ మైడ నారాయణరెడ్డి, విద్యార్థి నాయకుడు గుగులోత్ శంకర్నాయక్, సోషల్ వర్కర్లు సయ్యద్ ఖలీలుల్లా, డాక్టర్ మహ్మద్ అమీర్ హుస్సేన్ను ప్రమాణస్వీకారం చేశారు. మోజాంజాహీ మార్కెట్లోని ఆర్టిఐ కార్యాలయంలో మంగళవారం ఆర్టిఐ ప్రధాన కమిషనర్ రాజాసదారాం వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఈ ఐదుగురు కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. వీరు నేటి నుంచి మూడేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.
Katta Shekhar Reddy sworn in as RTI commissioner
- Advertisement -