Tuesday, May 14, 2024

సొంతూరు చింతమడకలో ఓటేసిన కెసిఆర్ దంపతులు..

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో కెసిఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని స్వగ్రామం చింతమడకకు చేరుకున్నారు. చింతమడక పోలింగ్ కేంద్రంలో కెసిఆర్ దంపతులు ఓటు వేశారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సజావుగా కొనసాగుతున్నది. ఈరోజు(గురువారం, నవంబర్ 30) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది. ఈక్రమంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

KCR Cast Vote at Chintamadaka Village

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News