- Advertisement -
హైదరాబాద్: ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సాయం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ రైతుబంధు సాయం అందించాలన్నారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులు జమ చేయాలని సూచించారు. రైతుబంధు కోసం రూ.7300 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సిఎం ఆదేశించారు. అందరికీ 10 రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలన్నారు. యాసంగి సీజన్ రైతుబంధు సాయం రెండో విడత పంపిణీపై అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్షలు జరిపారు.
- Advertisement -