Sunday, May 12, 2024

నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్న కెసిఆర్..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నవంబర్ 9న సిఎం కెసిఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయనున్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఎన్నికల ప్రాచారానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 15 బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

అనంతరం వారికి బీఫారాలు అందజేయడంతోపాటు బిఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇక, నవంబర్ 9న కోనాయపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం గజ్వేల్, కామారెడ్డిలో కెసిఆర్ నామినేషన్లు వేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News