- Advertisement -
కేంద్రానికి కేజ్రీవాల్ వినతి
న్యూఢిల్లీ: బ్రిటన్లో ఏర్పడిన అత్యంత తీవ్రమైన కొవిడ్ పరిస్థితి దృష్టా ఆ దేశానికి, భారత్కు మధ్య విమానాల రాకపోకలపై నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటన్కు విమానాల రాకపోకాలపై నిషేధాన్ని తొలగించి విమాన సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించిందని, అయితే ఆ దేశంలో నెలకొన్న తీవ్రమైన కొవిడ్ పరిస్థితుల దృష్టా నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఎంతో కష్టపడి ప్రజలు కొవిడ్ పరిస్థితిని దేశంలో అదుపులోకి తీసుకువచ్చారని, బ్రిటన్లో మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో ఇప్పుడు విమానాల సర్వీసులపై నిషేధాన్ని ఎత్తివేసి మన ప్రజల ప్రాణాలను ఎందుకు ముప్పులో పెడతారని ఆయన ప్రశ్నించారు.
- Advertisement -