అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా ఫస్ట్ లుక్స్ను ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఫస్ట్ లుక్స్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక అల్లు అర్జున్కి సంబంధించినంతవరకు ఇది తొలి పాన్ ఇండియా సినిమా. తెలుగుతోపాటు వివిధ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న విషయం విదితమే. రష్మిక మందన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా నటించబోతోంది. ఇదిలాఉండగా తన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కోసం దర్శకుడు సుకుమార్ ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంటారు. ‘రంగస్థలం’ సినిమా కోసం పూజా హెగ్దేని ఆయన ఐటమ్ బాంబులా మార్చేసిన విషయం విదితమే. ‘జిగేలురాణి..’ అంటూ సాగే ఆ సాంగ్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ‘పుష్ప’ సినిమా కోసం సుకుమార్ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరుని పరిశీలిస్తున్నారట. కియారా తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన విషయం విదితమే. ఇక కియారా అద్వానీ మంచి డ్యాన్సర్ కాబట్టి స్పెషల్ సాంగ్లో అల్లు అర్జున్తో పోటీ పడి డ్యాన్స్ చేయగల సత్తా ఈ బ్యూటీకి ఉందని చెప్పవచ్చు.