Friday, April 26, 2024

కియారాకు బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

Kiara Advani in Sarkari vari pata

 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో పట్టాలెక్కనున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. టైటిల్ తోనే విపరీతమైన హైప్ ను నమోదు చేసుకున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉండగా మరోపక్క ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. తాజాగా స్టోరీ లైన్‌కు సంబంధించి పలు గాసిప్స్ కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్‌గా ఒకరు ఖరారైనట్లు తెలిసింది. ఇంతకు ముందే మహేష్‌తో ‘భరత్ అనే నేను’లో హీరోయిన్‌గా కనిపించి మెప్పించిన కియారా అద్వానీ కథానాయికగా ఎంపికైందట. ఈ జోడి అంటే మహేష్ ఫ్యాన్స్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ కూడా. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ వారు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News