Tuesday, April 30, 2024

నిమ్స్‌లో 12 ఏళ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆరోగ్య శ్రీ పథకం కింద నిమ్స్ వైద్యులు 12 ఏళ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. ఆ బాలుడి తల్లి కిడ్నీ దానం చేసి బాలుడికి మళ్లీ జీవం పోసింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాలుడి తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. అయితే వీరికి జన్మించిన బాలుడు పుట్టుకతోనే బైలాటరల్ వెసికోయూరెటిరిక్ రిఫ్లక్స్ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఎడమ వైపు కిడ్నీ కూడా ఫెయిలైంది. దీంతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రులను సంప్రదించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆరోగ్య శ్రీ పథకం కింద నిమ్స్‌లో 6వ తరగతి చదువుతున్న తమ 12 ఏండ్ల కుమారుడిని చేర్పించారు.

దఫదఫాలుగా బాలుడికి చికిత్సలు నిర్వహించారు నిమ్స్ వైద్యులు. ఎడమ వైపు కిడ్నీని తొలగించారు. రెండో దశలో తల్లి దానం చేసిన కిడ్నీని కుమారుడికి విజయవంతంగా మార్పిడి చేశారు. మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని దశకు చేరుకున్న సమయంలో బాలుడికి మెరుగైన జీవితం అందించారు. అత్యంత అరుదైన మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న ఆ బాలుడికి మూత్రపిండ మార్పిడిని విజయవంతంగా నిర్వహించి బాలుడికి జీవితాన్నందించారు.ప్రస్తుతం తల్లీ కుమారుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా యూరాలజీ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 12 ఏండ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి చేయడం ఇదే ప్రథమం అని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కింద బాలుడికి ఉచితంగా శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు.

Also Read: బిజెపిలో చేరిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నారని, మూత్రపిండాల పనితీరు సాధారణ స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. సిరం క్రియాటిన్ లెవల్ 7 నుంచి 0.4 స్థాయికి చేరుకుందని అన్నారు. కిడ్నీ దానం చేసిన బాలుడి తల్లి కూడా ఆరోగ్యంగా ఉందని చెప్పారు. ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలో యూరాలజిస్టులు ప్రొఫెసర్ డాక్టర్ రామ్ రెడ్డి, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ రామచంద్రయ్య, డాక్టర్ చరణ్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ వినయ్, డాక్టర్ సునీల్, డాక్టర్ అరుణ్, డాక్టర్ విష్ణు, డాక్టర్ హర్ష, డాక్టర్ జానకి, డాక్టర్ పవన్, డాక్టర్ సూరజ్, డాక్టర్ పువారసన్, డాక్టర్ అనంత్, డాక్టర్ షారూఖ్, అనస్థీయా టీమ్ డాక్టర్ నిర్మల,

డాక్టర్ ఇందిర, డాక్టర్ కిరణ్, డాక్టర్ షిబానీ, నెఫ్రాలజిస్టులు డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ గంగాధర్, డాక్టర్ భూషణ్ రాజు భాగస్వాములయ్యారు. తమకు ప్రోత్సాహన్నిందిస్తున్న మంత్రి హరీశ్‌రావుకు, నిమ్స్ డైరక్టర్ డాక్టర్ బీరప్పకు నిమ్స్ యూరాలజీ బృందం ధన్యవాదాలు తెలిపింది. బాలుడికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించిన నిమ్స్ వైద్య బృందాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News