Monday, April 29, 2024

చర్చల ద్వారానే ’మణిపూర్’ సమస్యకు పరిష్కారం : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు 

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఓఆర్‌ఆర్ నిర్వహణను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓఆర్‌ఆర్ ఏటా ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గదని చెప్పారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే నగరం హైదరాబాద్. ఓఆర్‌ఆర్‌కు వస్తున్న ఆదాయాన్ని తక్కువ చేసి ప్రైవేట్ సంస్థకు ఎందుకు కట్టబెట్టారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

ఓఆర్‌ఆర్ తక్కువ ధరకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఓ పెద్ద స్కామ్ ఉందని ఆయన విమర్శించారు.30 ఏళ్లలో హెచ్‌ఎండిఎకు 75 వేల కోట్ల రూపాయలు టోల్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఓఆర్‌ఆర్ నిర్మాణం కోసం చేసిన అప్పులు అన్ని తీరిపోయాయి. అప్పులు తీరిపోతే టోల్ ప్రీ చేసే పాలసీ ఉంది. కాని దీనికి విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా టెండర్ పెట్టారు. ఇదో పెద్ద కుంభకోణంలా ఉందన్నారు. 30 సంవత్సరాలకు ఎందుకు లీజుకు ఇస్తున్నారు? టెండర్ల ప్రక్రియను తూతూ మంత్రంగా చేసి ఐఆర్‌బి కంపెనీకి కట్టబెట్టారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీనిపై విచారణ జరిపిస్తాం‘ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

చర్చల ద్వారానే ’మణిపూర్’ సమస్యకు పరిష్కారం : కిషన్‌రెడ్డి
మణిపూర్‌లో ఘర్షణలు, హింసపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని.. హింసతో సాధించేదేమీ లేదన్నారు. మణిపూర్‌లో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5.500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మణిపూర్ యువత హింసను పక్కన పెట్టి అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News