Sunday, April 28, 2024

అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: జిల్లా కేంద్రానికి సమీపంలోని అనంతగిరిలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని సోమవారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్త యన్. పద్మనాభం, ఈఓ టీ.నరేందర్. వేద ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి స్వామి వారి ఫోటో బహూకరించారు.

అదేవిధంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ.. దేవాలయం భూమి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందిస్తూ.. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడంతోపాటు పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా బిజెపి అధ్యక్షులు సదానంద రెడ్డి, నాయకులు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News