- Advertisement -
ఆంధ్రప్రదేశ్ : వారు ప్రాణ స్నేహితులు.. కానీ ఇప్పుడు బద్ద శత్రువులుగా మారిపోయారు. భోజనానికి పిలవలేదని స్నేహితుడిని కత్తితో పొడిచిన ఘటన బొల్లపల్లి మండలంలో శనివారం జరిగింది. మండలంలోని గరికపాడుకు చెందిన మొక్కపాటి రామారావు అదే గ్రామానికి చెందిన పసుపులేటి రత్నం స్నేహితులు. వీరు రాజకీయంగా వేరువేరు పార్టీల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల రామారావు తల్లి చనిపోవడంతో పెద్ద కర్మ సంధర్భంగా భోజనానికి రత్నంను పిలవలేదు. దీంతో కక్ష పెంచుకున్నరత్నం రామారావుకి ఫోన్చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే బజారులో కూర్చున్న రామారావుపై రత్నం కత్తితో దాడి చేసి పొట్ట, వీపుపైన పొడిచాడు. బాధితుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రకి తరలించరు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -