Monday, April 29, 2024

కొండా సవాల్‌కు బండి సై

- Advertisement -
- Advertisement -

Konda vishweshwar reddy challenge to bandi sanjay

 

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ఎంపి కొండా విశ్శేశ్వర్‌రెడ్డి వైట్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్ర తర్వాత టెస్టు కోసం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ఆయన చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన తన పాదయాత్ర ముగియనుందన్నారు. పాదయాత్ర ముగిసన తర్వాత తాను టెస్టుల కోసం వస్తానని బండి సంజయ్ చెప్పారు. తనకు ఎలాంటి అలవాట్లు లేవని ఆయన తెలిపారు. బాగా బలిసి బలుపు ఎక్కినోడే డ్రగ్స్ తీసుకొంటాడని బండి సంజయ్ కుమార్ చెప్పారు.

ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెడ్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారా? అని బండి ప్రశ్నించారు. తనపై రాజద్రోహం కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి డ్రగ్స్ కేసు విషయమై స్పందిస్తూ తాను డ్రగ్స్ టెస్టు కోసం సిద్ధమని ప్రకటించారు. కెటిఆర్, కొండా విశ్వేశ్వరరెడ్డి పరీక్షలకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ మేరకు వారిద్దరికి ఛాలెంజ్ విసిరారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు బండి సంజయ్ సై అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News