Sunday, April 28, 2024

టిఆర్ఎస్ విజయం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం..

- Advertisement -
- Advertisement -

Koppula Eshwar comments on MLC Result 2021

హైదరాబాద్: టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో అన్నింటిని.. అంటే నూటికి నూరు శాతం టిఆర్ఎస్ గెల్చుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ 12 సీట్లలో 6 స్థానాలను ఏకగ్రీవంగా గెల్చుకోవడం, పోలింగ్ జరిగిన ఆరింటిని భారీ ఓట్ల మెజారిటీతో గెల్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలుగా ఘన విజయం సాధించిన భానుప్రసాదరావు, రమణ, విఠల్, యాదవరెడ్డి, కోటిరెడ్డి, మధులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా యావత్తు ప్రజానీకం టిఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపిన, ఓటేసిన ప్రజాప్రతినిధులకు, సహకరించిన పార్టీ ప్రముఖులకు, నాయకులకు, శ్రేణులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిజేశారు.ఇక, గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారికి మంత్రి కొప్పుల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Koppula Eshwar comments on MLC Result 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News