- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని హైదర్గూడలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. కుటుంబ సభ్యులపై యువకుడు రాడ్ తో దాడి చేశాడు. సోమవారం అర్థరాత్రి సమయంలో సందీప్ రెడ్డి అనే వ్యక్తి తన తల్లి, సోదరుడిపై రాడ్తో దాడి చేశాడు. అడ్డుకోబోయిన స్థానికులపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. గాయపడిన తల్లి, సోదరుడిని ఆస్పత్రికి తరలించారు. తల్లి, సోదరుడు ప్రదీప్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -