Friday, May 3, 2024

‘కవనం’ కవితా సంపుటిని ఆవిష్కరించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ప్రముఖ కవి, రచయిత రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన గంగాడి సుధీర్ రచించిన రెండవ పుస్తకం ‘కవనం’ కవితా సంపుటిని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ఆవిష్కరించారు. గురువారం టిసాట్ ప్రాంగణంలో జరిగిన వేడుకలో ఓయూ, అంబేద్కర్ యూనివర్శిటీ వీసీలు, టిసాట్ సీఈవో శైలేష్ రెడ్డి ఇతర విద్యావేత్తల సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ భవిష్యత్తులో గంగాడి సుధీర్ మరిన్ని మంచి రచనలు చేయాలని అభిలషించారు. ఈ సందర్భంగా రచయిత గంగాడి సుధీర్ మాట్లాడుతూ సచివాలయం ప్రారంభోత్సవం సమయంలో మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా

కవర్ పేజీ ఆవిష్కరించకున్న ‘కవనం‘ కవితా సంపుటిని తన జన్మక్షేత్రం సిరిసిల్లలో ఆవిష్కరించాలనుకున్నప్పటికీ, తన కార్యక్షేత్రంలో కేటీఆర్ చేతులమీదుగా విడుదలవడం సంతోషంగా ఉందన్నారు. తన మొదటి పుస్తకం ’ఇగురం’ కథా సంపుటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అనేక మంది ప్రముఖుల, పండిత పామరుల ఆదరాబిమానాలు పొంది ఎంతో గుర్తింపును తెచ్చిందని, ఈ రెండవ పుస్తకాన్ని సైతం అలాగే ఆదరించాలని కోరారు. తన పుస్తకాలు అన్ని ప్రముఖ పుస్తక షాపులతో పాటు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ రవిందర్ యాదవ్, అంబేద్కర్ యూనివర్శిటీ వీసీ సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News