Saturday, May 4, 2024

కాంగ్రెస్ 3 గంటలు.. బిజెపి మత మంటలు కావాలా?.. కెసిఆర్ 24గంటలు కావాలా?

- Advertisement -
- Advertisement -

ఇది రైతులోకం తేల్చుకోవాల్సిన తరుణం

మొన్న ధరణి, నేడు కరెంట్ కట్ అంటూ రేవంత్ రెడ్డి
చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ వరుస ట్వీట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: రైతులకు మూడు గంటల పాటే ఉచిత విద్యుత్ అవసరం అంటూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగేటట్టు లేదు. ఈ ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన కామెంట్స్‌పై మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. ‘రైతులకు ఇది కాంగ్రెస్ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక’ అంటూ వరుస ట్వీట్లు చేశారు. జాగ్రత్త పడాలని సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కాంగ్రెస్ వస్తే నిన్న ధరణి తీసేస్తం అన్నారని, ఇప్పుడు అదే రాబందు నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు.. నేడు మూడు దండగ అంటున్నారు చోటా చంద్రబాబు’ అంటూ రేవంత్‌పై వి మర్శనాస్త్రాలు గుప్పించారు. మూడెకరాల రైతుకు మూడుపూటలా కరెం ట్ ఎందుకు అనడం అంటే ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమేనంటూ కెటిఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్నకారు రైతు అంటే చిన్నచూపని కామెంట్ చేశారు. నోట్లు తప్ప రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయమన్నారు. అన్నదాత నిండా మునుగుడు పక్కా అని స్టేట్‌మెంట్ పాస్ చేశారు. నాడు ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్, నేడు ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందన్నారు.

మూడు గంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలని ఎద్దేవా అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం అవుతాయన్నారు. మరోసారి రాబందు 3 గంటల మాటెత్తితే రైతుల చేతిలో మాడు పగలడం ఖాయమని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని తెలిపారు. రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కావాలా? 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ?? తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. కాసేపటికే మరో ట్వీట్ చేసిన కెటిఆర్, కెసిఆర్ నినాదం మూడు పంటలు అయితేచ కాంగ్రెస్ విధానం మూడు గంటలని, బిజెపి విధానం మతం పేరిట మంటలు అని విరుచుకుపడ్డారు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా?… మతం పేరిట మంటలు కావాలా? తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News